Monday, 25 May 2026

ఇంకొన్ని డిగ్రీలు పెరిగితే చావే!


ఇవ్వాళ 25 మే నుంచి 2 జూన్ వరకు, మన దేశంలో ఎండలు 55 డిగ్రీలను తాకనున్నాయని ప్రపంచం అంతా ఇమేజెస్, గ్రాఫ్‌లతో మొత్తుకుంటోంది. సోషల్ మీడియా అంతా కూడా ఇవే పోస్టులు. 

55 డిగ్రీలు అంటే మామూలు విషయం కాదు. చిన్నపిల్లలు, వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవారికి చాలా ప్రమాదకరం. నేరుగా ఇంత వేడికి ఎక్స్‌పోజ్ అయ్యేవారు ఆరోగ్యవంతులైనా సరే, కొందరు రెండే రెండు గంటల్లో చనిపోతారట. 

వచ్చే కొన్నేళ్ళలో ఇది ఇంకో 3 డిగ్రీలకు పెరుగుతుందని చదివాను. 

అది డైరెక్ట్ చావే. 

ఈ ఒక్క కారణంగా, భవిష్యత్తులో మిలియన్లలో భారతీయులు వేరే దేశాలకు వలసపోతారని ఒక అంచనా. 

కట్ చేస్తే -

అసలు దీని గురించి ప్రభుత్వాలూ, మంత్రిత్వశాఖలు... పి యమ్‌లు, సీయమ్‌లు... ఎవరైనా పట్టించుకుంటున్నారా? ఏవైనా చర్యలు చేపడుతున్నారా?

అసలు ఎవరికైనా ఏ కొంచెమైనా అవగాహన ఉందా? ప్రజలకు చెప్తున్నారా?

పనికిరాని నానా చెత్త ప్రసారం చేసే టీవీ చానెల్స్, యూట్యూబులు దీని గురించి బ్రేకింగ్ న్యూస్‌లు ఎందుకివ్వరు?

ఎంతసేపూ రాజకీయాలు, కుర్చీలు, అధికారం, అవినీతి కోసం కొట్లాటలేనా?  

నిజంగా ఇది కరోనా కంటే ప్రమాదకరం కాదా? 
అసలెవ్వరూ ఎందుకని పట్టించుకోవడం లేదు?  

- మనోహర్ చిమ్మని     

Map source: @zoom_earth 
More information: 
https://x.com/TrashCaffeine/status/2058891647732322592
https://x.com/BladeoftheS/status/2058868053404791102  

No comments:

Post a Comment

Thanks for your time!
- Manohar Chimmani