మా గుడిపాటికి దాశరథి అవార్డు వచ్చినప్పుడు నేను సిటీలోలేను. తర్వాత అయినా కలిసి విష్ చేద్దామనుకున్నాను. కుదరలేదు. అనుకోకుండా నిన్న సుందరయ్య పార్కు దగ్గరున్న 'పాలపిట్ట' ఆఫీసుకి వెళ్ళాను.
లోపలి దృశ్యంలో ఎలాంటి మార్పు లేదు.
ఒక్కడే కంప్యూటర్ ముందు కూర్చుని పనిచేసుకుంటున్నాడు గుడిపాటి. బహుశా అది పాలపిట్ట తాజా సంచిక అనుకుంటాను. ఎడిట్ చేస్తున్నాడు.
అదే సింపుల్ గెటప్. అవే కళ్ళద్దాలు. డై వేయని అదే ఒత్తైన జుట్టు. నన్ను చూడగానే అదే చిరునవ్వుతో కూడిన పలకరింపు, "హాయ్, యార్" అంటూ!
తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన ప్రతిష్టాత్మక దాశరథి అవార్డు గ్రహీత అయిన నా మిత్రుడు గుడిపాటిలో ఎలాంటి మార్పు లేదు. కొంచెం కూడా.
ఉస్మానియా యూనివర్సిటీలో ఎమ్మే, బి సి జె, బి ఎడ్ చదివిన గుడిపాటి, పీజీలో స్వాని రామానంద తీర్థ బంగారుపతక విజేత. ఇప్పటివరకు గుడిపాటి రాసిన పుస్తకాలు సుమారు 13 వరకు అచ్చయ్యాయి. ఇవి కాకుండా, వివిధ కలం పేర్లతో రాసిన పుస్తకాలు కూడా గుడిపాటి అచ్చయిన పుస్తకాల లిస్టులో ఉన్నాయి.
లెక్చరర్ కావాలనుకున్నాడు. కొన్నాళ్ళు ఆ ఉద్యోగం కూడా చేశాడు. కాని, జర్నలిజం పైన ఆసక్తి, సాహిత్యం పైన మమకారం గుడిపాటి దిశను మార్చేశాయి. ఎన్నో చిన్నా పెద్దా పత్రికల్లో పనిచేసి, చివరకు "వార్త"లో సండే బులెటిన్ ఎడిటర్గా ఆ జర్నీకి గుడ్బై చెప్పాడు.
లెక్చరర్ కావాలనుకున్నాడు. కొన్నాళ్ళు ఆ ఉద్యోగం కూడా చేశాడు. కాని, జర్నలిజం పైన ఆసక్తి, సాహిత్యం పైన మమకారం గుడిపాటి దిశను మార్చేశాయి. ఎన్నో చిన్నా పెద్దా పత్రికల్లో పనిచేసి, చివరకు "వార్త"లో సండే బులెటిన్ ఎడిటర్గా ఆ జర్నీకి గుడ్బై చెప్పాడు.
2010 ఫిబ్రవరిలో తను ప్రారంభించిన 'పాలపిట్ట' సాహిత్య మాసపత్రికను గత పదహారేళ్ళుగా "వన్ మాన్ ఆర్మీ"లా గుడిపాటి విజయవంతంగా నిర్వహిస్తున్నాడంటే అంత చిన్నవిషయమేం కాదు. ఒక ప్రచురణ కర్తగా కూడా నాకు తెలిసి ఇప్పటికి ఒక 400 పుస్తకాలను తన 'పాలపిట్ట బుక్స్' నుంచి ప్రచురించాడు గుడిపాటి.
‘పాలపిట్ట’ మాసపత్రిక సంపాదకునిగా సాహిత్య జర్నలిజంలో కొత్త ఒరవడిని తీసుకొచ్చిన గుడిపాటి... ఒక రచయితగా... సాహిత్యం, సాహిత్యేతర రచనలు అనేకం చేశాడు. నాకు తెలిసి, గుడిపాటి సొంతంగా రాసిన వాటి కన్నా వివిధ కలం పేర్లతో చేసిన రచనలే చాలా ఉంటాయనుకుంటున్నాను. రాసింది కొన్ని కథలే అయినా, గుడిపాటికి బాగా ఇష్టమైన వ్యాపకం కథారచన అని నాకు తెలుసు.
తెలంగాణ ప్రభుత్వం నుంచి ఇప్పుడు తాను అందుకున్న దాశరథి అవార్డుకు ముందు... గుడిపాటి రాసిన ‘సంవిధానం’ కథా సాహిత్య వ్యాసాల సంపుటి పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి ఉత్తమ విమర్శనా గ్రంథ పురస్కారం పొందింది. 2023లో తెలంగాణ సారస్వత పరిషత్ వారు వరిష్ట పురస్కారం ప్రదానం చేశారు. ఇంకా పలు సంస్థలు విభిన్న సందర్భాల్లో పురస్కారాలు అందించాయి.
వ్యాపార కాక్ష లేకుండా తెలుగు భాష, సాహిత్యం కోసం ఇంతలా ఒంటరిపోరాటం చేస్తున్న గుడిపాటికి ప్రభుత్వం నుంచి, వివిధ సంస్థల నుంచి, సాహితీ ప్రేమికుల నుంచి, భాషాప్రేమికుల నుంచి తగినంత ఆర్థిక తోడ్పాటు కూడా అవసరం అని నాకనిపిస్తుంది.
తెలంగాణ ప్రభుత్వం నుంచి ఇప్పుడు తాను అందుకున్న దాశరథి అవార్డుకు ముందు... గుడిపాటి రాసిన ‘సంవిధానం’ కథా సాహిత్య వ్యాసాల సంపుటి పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి ఉత్తమ విమర్శనా గ్రంథ పురస్కారం పొందింది. 2023లో తెలంగాణ సారస్వత పరిషత్ వారు వరిష్ట పురస్కారం ప్రదానం చేశారు. ఇంకా పలు సంస్థలు విభిన్న సందర్భాల్లో పురస్కారాలు అందించాయి.
వ్యాపార కాక్ష లేకుండా తెలుగు భాష, సాహిత్యం కోసం ఇంతలా ఒంటరిపోరాటం చేస్తున్న గుడిపాటికి ప్రభుత్వం నుంచి, వివిధ సంస్థల నుంచి, సాహితీ ప్రేమికుల నుంచి, భాషాప్రేమికుల నుంచి తగినంత ఆర్థిక తోడ్పాటు కూడా అవసరం అని నాకనిపిస్తుంది.
కట్ చేస్తే -
దాశరథి అవార్డుకు ముందు, దాశరథి అవార్డు తర్వాత... ఖచ్చితంగా కొంత మార్పు గుడిపాటిలో, ఆయన చేస్తున్న పనుల్లో ఉండాలన్నది నా అభిలాష.
ఇదే అభిలాషను మా 'కవిసంగమం' యాకూబ్ కూడా వ్యక్తం చేశాడు.
నిన్న పాలపిట్ట ఆఫీసులో గుడిపాటి, నేను మాట్లాడుకుంటుండగానే నా ఎమ్మే క్లాస్మేట్, మిత్రుడు యాకూబ్ కూడా అక్కడికి రావటం నాకు మరింత ఆనందాన్ని కలిగించిన విషయం.
నిన్నటి మా క్యాంపస్ కబుర్లు, పర్సనల్ నాస్తాల్జియాలు, పలు ఇతర అంశాల మీద చర్చల అనంతరం నాకు అర్థమయ్యింది ఏంటంటే... త్వరలో గుడిపాటి నుంచి కొత్త వార్తల్ని మనం వింటాం.
అందులో మొదటిది "పాలపిట్ట లిటరరీ ఫెస్టివల్" కావచ్చు.
- మనోహర్ చిమ్మని







