Wednesday, 25 April 2018

రమ్యంగా కుటీరాన రంగవల్లు లల్లిందీ ..

"నిదురించే తోటలోకి
పాట ఒకటి వచ్చిందీ

కన్నుల్లో నీరు తుడిచి
కమ్మటి కల ఇచ్చింది

రమ్యంగా కుటీరాన
రంగవల్లు లల్లిందీ
దీనురాలి గూటిలోన
దీపంగా వెలిగిందీ

శూన్యమైన వేణువులో
ఒక స్వరం కలిపి నిలిపిందీ
ఆకు రాలు అడవికి
ఒక ఆమని దయ చేసిందీ

విఫలమైన నా కోర్కెలు వేలాడే గుమ్మంలో
ఆశల అడుగులు వినపడీ అంతలో పోయాయి
కొమ్మల్లో పక్షుల్లారా గగనంలో మబ్బుల్లారా
నది దోచుకు పోతున్న నావను ఆపండి
రేవు బావురుమంటోందని నావకు చెప్పండి
నావకు చెప్పండి ..."

కట్ టూ గుంటూరు శేషేంద్ర శర్మ -

కవిసేన మానిఫెస్టో రాసిన గుంటూరు శేషేంద్ర శర్మగారే బాపు గారి 'ముత్యాల ముగ్గు'లో ఇంత అద్భుతమైన పాట రాశారు.

ఈ పాటలోని ప్రతివాక్యం ఒక కొత్త ప్రయోగమే. ఒక కొత్త భావమే. 

సుశీల తీయటి గొంతు, మహదేవన్ అద్భుత సంగీతంలో .. ఈ పాటలో వయొలిన్, వీణ, ఫ్లూట్ ఒకదాన్ని మించి ఒకటి 'ఓహ్' అనిపిస్తాయి. 

ఎప్పుడూ పీకలదాకా ఉండే వ్యక్తిగత, వృత్తిగత వత్తిళ్ల రొటీన్ నగరజీవితం మధ్యలో కూడా, మొన్న రాత్రి నుంచి ఈ పాటను కనీసం ఒక అరడజను సార్లు విన్నాను.

నిన్న రాత్రి ఒక పార్టీ మధ్యలో మా మ్యూజిక్ డైరెక్టర్‌తో ఈ పాట గురించి ఒక అరగంట సేపు అలా ట్రాన్స్‌లోకెళ్లి చర్చించాను.   

చాలా ఏళ్ల తర్వాత ఇంత మంచి పాట నేను గుర్తుకు తెచ్చుకోడానికి కారణమైన ఒక బ్లాగ్ కామెంటర్‌కు థాంక్స్ చెప్పకుండా ఎలా ఉండగలను? 

3 comments:

  1. "ఆశల అడుగులు వినపడీ అంతలో పోయాయి
    కొమ్మల్లో పక్షుల్లారా గగనంలో మబ్బుల్లారా
    నది దోచుకు..."

    అంతలో ఆగాయి అనీ నది తోసుకు పోతున్న అని గుర్తు. పాటను మరలా వినాలి నేను.

    ReplyDelete
  2. సహస్రాబ్ది దార్శనిక కవి
    కవిర్విశ్వో మహాతేజా
    గుంటూరు శేషేంద్ర శర్మ
    Seshendra: Visionary Poet of the Millennium
    http://seshendrasharma.weebly.com/

    జననం 1927 అక్టోబరు 20నాగరాజపాడు, నెల్లూరుజిల్లా

    మరణం 2007 మే 30 (వయసు 79)హైదరాబాదు

    తండ్రి సుబ్రహ్మణ్య శర్మ

    తల్లి అమ్మాయమ్మ
    భార్య / జానకి
    పిల్లలు వసుంధర; రేవతి (కూతుర్లు); వనమాలి; సాత్యకి (కొడుకులు)
    సౌందర్యమే ఆయనకు అలంకారం,సౌందర్యమే ఆయనకు జీవితం
    విమర్శకుడు : కవి
    ఆయన రూపం సుందరం, మాట మధురం, కవిత్వం రసభరితం. అలంకారశాస్త్రాలను ఔపోసనపట్టిన పండితుడు. మంచివక్త, వ్యాసం, విమర్శ.. ఏదిరాసినా ఆయన ముద్ర ప్రస్ఫుటం. ఆయనది విశ్వమానవ దృష్టి. పానపీన ఆహారవిహారాల నుంచి నిత్య నైమిత్తిక కార్యాచరణలు, ఆలోచనలు… అన్నింటా ఆయన సంప్రదాయ, ఆధునిక తత్వాల మేళవింపు. ‘సర్వేజనాస్సుఖినోభవంతు’ అన్నది ఆయన ఆత్మనినాదం, ఘోషం. ఆత్మీయులకూ, అభిమానులకూ ఆయన శేషేన్, శేషేంద్ర. అటూ ఇటూ బంధుత్వాలను తగిలిస్తే ఆయన పేరు గుంటూరు శేషేంద్ర శర్మ……….
    – ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక,
    (21 ఆగస్టు, 2000)
    * * *
    పుట్టిన ఊరు నెల్లూరు జిల్లా ఉదయగిరితాలూకా నాగరాజుపాడు.
    భారత ప్రభుత్వ ‘రాష్ట్రేంద్రు’ బిరుదం, కలకత్తా రాష్ట్రీయ హిందీఅకాడమీ అవార్డు,
    కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, తెలుగు విశ్వ విద్యాలయం గౌరవడాక్టరేటు ముఖ్య పురస్కారాలు.
    గుంటూరు ఎ.సి. కాలేజీ నుంచి పట్టభద్రులు. మద్రాసు లాకాలేజీ నుంచి ‘లా’ డిగ్రీ.
    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోమున్సిపల్ కమీషనరుగా పనిచేసి, పదవీ విరమణ వేశారు.
    నాదేశం – నాప్రజలు, మండే సూర్యుడు, గొరిల్లా, సముద్రం నా పేరు, కవిసేన మేనిఫెస్టో, రక్తరేఖ, స్వర్ణహంస, కాల రేఖ, షోడశి, ఆధునిక మహాభారతం, జనవంశమ్ ప్రధాన రచనలు.
    కవిత్వంలో, సాహిత్యవిమర్శలో విలక్షుణులు.
    ప్రపంచ సాహిత్యం మీద, భారతీయ సాహిత్యం మీద సాధికారిక పరిచయం.
    సంస్కృత, ఆంధ్ర, ఆంగ్లభాషల్లో పండితులు,
    వచన కవిత్వం, పద్య రచన – రెండిరటి సమాన ప్రతిభావంతులు,
    ఆధునిక కవిత్వంలో విలక్షణ ఊహాశాలిత ఈయన ప్రత్యేకత.
    వచన కవిత్వానికి ఒక కొత్త వాకిలి తెరిచిన స్వతంత్రులు.
    బహిరంతర ప్రకృతులకు తమ రచనల ద్వారా వ్యాఖ్యానం పలికిన దార్శనిక కవి.
    ఒకానొకశైలీనిర్మాత.

    – యువ నుంచి యువ దాకా (కవితా సంకలనం)
    అ.జో. – వి. భొ. ప్రచురణలు 1999
    Visionary Poet of the Millennium
    http://seshendrasharma.weebly.com

    ReplyDelete
  3. Visionary Poet of the Millennium
    An Indian poet Prophet

    Seshendra Sharma

    October 20th, 1927 - May 30th, 2007
    http://seshendrasharma.weebly.com/

    https://www.facebook.com/GunturuSeshendraSharma/

    Seshendra Sharma is one of the most outstanding minds of modern Asia. He is the foremost of the Telugu poets today who has turned poetry to the gigantic strides of human history and embellished literature with the thrills and triumphs of the 20th century. A revolutionary poet who spurned the pedestrian and pedantic poetry equally, a brilliant critic and a scholar of Sanskrit, this versatile poet has breathed a new vision of modernity to his vernacular.Such minds place Telugu on the world map of intellectualism. Readers conversant with names like Paul Valery, Gauguin, and Dag Hammarskjold will have to add the name of Seshendra Sharma the writer from India to that dynasty of intellectuals.




    Rivers and poets
    Are veins and arteries
    Of a country.
    Rivers flow like poems
    For animals, for birds
    And for human beings-
    The dreams that rivers dream
    Bear fruit in the fields
    The dreams that poets dream
    Bear fruit in the people-

    * * * * * *

    The sunshine of my thought fell on the word
    And its long shadow fell upon the century
    Sun was playing with the early morning flowers
    Time was frightened at the sight of the martyr-

    - Seshendra Sharma

    B.A: Andhra Christian College: Guntur: A.P: India

    B.L : Madras University: Madras

    Deputy Municipal Commissioner (37 Years)

    Dept of Municipal Administration, Government of Andhra Pradesh

    Parents: G.Subrahmanyam (Father) ,Ammayamma (Mother)
    Siblings: Anasuya,Devasena (Sisters),Rajasekharam(Younger brother)
    Wife: Mrs.Janaki Sharma
    Children: Vasundhara , Revathi (Daughters),

    Vanamaali ,Saatyaki (Sons)


    Seshendra Sharma better known as Seshendra is

    a colossus of Modern Indian poetry.
    His literature is a unique blend of the best of poetry and poetics.
    Diversity and depth of his literary interests and his works
    are perhaps hitherto unknown in Indian literature.
    From poetry to poetics, from Mantra Sastra to Marxist Politics his writings bear an unnerving pprint of his rare genius.

    His scholar ship and command over Sanskrit , English and Telugu Languages has facilitated his emergence as a towering personality of comparative literature in the 20th century world literature.
    T.S.Eliot ,ArchbaldMacleish and Seshendra Sharma are trinity of world poetry and Poetics.
    His sense of dedication to the genre of art he chooses to express himself and
    the determination to reach the depths of subject he undertakes to explore

    place him in the galaxy of world poets / world intellectuals.-------------

    ReplyDelete

Thanks for your time!
- Manohar Chimmani