Friday, 11 November 2016

మన రూట్స్ మర్చిపోవద్దు!

చాయ్‌వాలా నుంచి దేశ ప్రధానమంత్రి స్థాయికి ఎదిగిన నరేంద్ర మోదీ జర్నీ ఒక సక్సెస్ స్టోరీగా నాకు చాలా ఇష్టం.

అదంత సులభమైన జర్నీ కాదు. అందరికీ సాధ్యం కాదు.

ఇక్కడ రాష్ట్రంలో నేను పక్కా
కె సి ఆర్, తెరాస అభిమానిని.

కానీ, ఈ దేశపౌరుడిగా కేంద్రంలో ఏ పార్టీ ఉన్నా - ఆ పార్టీ, ఆ ప్రభుత్వం ఉండాల్సిన అయిదేళ్ళూ బలంగా ఉండాలని మనస్పూర్తిగా కోరుకొంటాను.

ముందు మన దేశం కాబట్టి.

మోదీజీ విషయంలో అయితే ఇదే మరింత మనస్పూర్తిగా ఆశిస్తున్నాను.


కట్ టూ 500, 1000 'బ్లాక్' బ్యాక్ - 

భారత్‌ను ఒక అవినీతిరహిత దేశంగా, అత్యుత్తమస్థాయిదేశంగా మార్చాలని మోదీజీ ఆశ, ఆశయం. అదే దిశలో బాగా కృషి చేస్తున్నారు. ఆయన కృషి ఫలించాలని ఆశిద్దాం. ఆ కృషి వివరాల్లోకి నేనిప్పుడు వెళ్లటం లేదు.

500, 1000 రూపాయల చలామణికి సంబంధించి - మొన్న మోదీజీ ఇచ్చిన షాకింగ్ బ్రేకింగ్ న్యూస్ విషయం గురించే ఈ బ్లాగ్ పోస్టు.

బ్లాక్‌మనీ విషయంలో ఈ చర్య చాలా మంచిదే.

కానీ, కోట్లాదిమంది మిడిల్ క్లాస్, అంతకంటే తక్కువస్థాయి ప్రజల నిత్యజీవితంలో రూపాయి రూపాయితో ఉండే అవసరం విస్మరించడం కరెక్టు కాదు.

"ఒక గొప్ప నిర్ణయం తీసుకొన్నప్పుడు కొన్నిరోజులు కొంతమంది ఇబ్బంది పడాలి తప్పదు" అనే వాదన బహుశా ఈ విషయంలో సరికాదు.

కొన్నిరోజులయినా సరే, కొన్ని గంటలయినా సరే .. ఇబ్బంది పడాల్సింది ఎవరినైతే టార్గెట్ చేశారో వాళ్లే పడాలి తప్ప, బ్లాక్ మనీకి సంబంధించి ఏ పాపం ఎరుగనివాళ్లు కాదు.  

19 ఆగస్టు 2014 నాడు తెలంగాణ రాష్ట్రమంతా ఒకే రోజు "ఇంటింటి సర్వే" అని కె సి ఆర్ అన్నప్పుడు ఎంతోమంది విమర్శించారు. అసాధ్యం అంటూ అపహాస్యం కూడా చేశారు.

కానీ ఒక్క రోజులో సర్వే 100% గ్రాండ్ సక్సెస్ చేసి చూపించారు కె సి ఆర్, ఆయన దళం.

ఆ సక్సెస్ వెనుక ఎంత ప్లానింగ్, ఎంతమంది ఉద్యోగులు, కార్యకర్తలు, వాలంటీర్ల సిన్సియర్ శ్రమ ఉండి ఉంటుంది?

అలాంటివే మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ ఎట్సెట్రా.

వీటన్నిటి గురించి కూడా ప్రతిపక్షాలనుంచి అన్నీ అనుమానాలూ అపహాస్యాలే. కానీ, అంచెలంచెలుగా వాటి విజయాలెలా ఉన్నాయి?

60 ఏళ్లుగా ఎవ్వరూ కనీసం ఆలోచించని పనులు అలవోకగా అయిపోతుంటే దిమ్మ తిరిగిపోవటంలేదూ?

దటీజ్ కె సి ఆర్.

మరోవైపు .. బ్లాక్‌మనీకి సంబంధించి మోదీజీ ఆలోచన చాలా మంచిదే. కానీ, దాని ఆచరణే మిస్‌ఫైర్ అయిందని నేననుకుంటున్నాను.

సడెన్‌గా వచ్చిన ఈ సమస్యవల్ల, నాలుగు 500 నోట్లు మార్చుకోడానికి కొంపల్లిలో ఉన్న నా మిత్రుడొకరికి బ్యాంకులో మూడున్నర గంటలు పట్టింది. చివరికి ఆ మొత్తం ఒక 2000 రూపాయల గులాబి నోటు రూపంలో ఇచ్చారు. దానికి చిల్లర బయట దొరకదు!

ఏం చేయాలతను?

టార్గెట్ చేసిన మనుషులు మాత్రం కూల్‌గా ప్లాన్ చేసుకొంటూ వాళ్ల మార్పిడి పనుల్లో వాళ్లున్నారు.

ఈ బ్లాగ్ రాస్తున్న సమయానికి కూడా సిటీలోనే 70%  ATM లు ఇంకా పనిచేయడం లేదు.

ఎన్ని వ్యాపారాలు ఎంత నష్టపోయుంటాయి?

ఎంతమంది ఎన్నిరకాలుగా ఇబ్బంది పడుతుంటారు?

ఫలితం ..

ఒకే ఒక్కరోజులో మూడున్నర లక్షలమంది ట్విట్టర్‌లో మోదీజీ ని "అన్‌ఫాలో" అయ్యారు! 

దీని ప్రభావం ముందు ముందు ఇంకెన్ని చోట్ల ఇంకెలా ఉండబోతోందో ఎవరికి తెలుసు?

బ్లాక్‌మనీవాళ్లను టార్గెట్ చేయాల్సిందే. కానీ .. చాయ్‌వాలా కష్టాన్ని మర్చిపోతే ఎలా?  

2 comments:

  1. అసలు సమస్య అంతా కొత్త రూ.500 నోట్లను విడుదలచేయక పోవటంతో వచ్చిందని నా అభిప్రాయం. అవి కూడా రూ. నోట్లతో పాటే విడుదల చేసి బ్యాంకులలో ఎటియం మెషీన్లలో ఇవ్వటం‌ జరుగుతుంతె జనానికి ఈ అనవసరమైన చిల్లర ఇబ్బంది వచ్చేదే కాదు. ఇంత చిన్న పాయింట్ ఎలా కేంద్రప్రభుత్వం విస్మరించిందో అని ఆశ్చర్యం కలుగుతోంది.

    ReplyDelete
    Replies
    1. You are right andi.
      Aa okkate kadu. inkenno chinna chinna points chala light teesukunnaru. adii samasya! Thanks for the comment andi. :)

      Delete

Thanks for your time!
- Manohar Chimmani