Pages

Monday, 28 November 2016

ఇ-ఆఫీస్ కు స్వాగతం!

తెలంగాణ రాష్ట్రంలో "పేపర్‌లెస్" బోర్డు సమావేశాన్ని నిర్వహించిన తొలి సంస్థ రాష్ట్ర ఖనిజాభివృధ్ధి సంస్థ (TSMDC).

అది మొన్న నవంబర్ 22వ తేదీనే విజయవంతంగా జరిగింది.


కట్ చేస్తే - 

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె సి ఆర్ గారికి పొలిటికల్ సెక్రెటరీ, TSMDC ఛైర్మన్ కూడా అయిన శేరి సుభాష్ రెడ్డి, ఇదే TSMDC వేదికగా అతిత్వరలో మరో సంచలనానికి తెరలేపనున్నారు.

అది డిసెంబర్ 1, 2016.

ఆరోజునుంచీ, తెలంగాణ రాష్ట్రంలో తొలి పేపర్‌లెస్ "ఇ-ఆఫీస్" గా TSMDC కార్యాలయం పనిచేయబోతోంది!

రాష్ట్ర పరిశ్రమలు, ఐ టి శాఖ మంత్రి కె టి ఆర్ గారి ఆదేశాలమేరకు ఈ విషయంలో ఏర్పాట్లన్నీ దాదాపు పూర్తయ్యాయి.

కొత్తగా రూపాంతరం చెందనున్న ఈ "ఇ-ఆఫీస్" ప్రక్రియ వల్ల ప్రధానంగా ఆఫీసుల్లో ఉండే రెడ్‌టేపిజం పోయి, పనివేగం పెరుగుతుంది. ఎక్కడ ఏ ఫైల్ ఉందీ, ఎక్కడ ఎందుకు ఆలస్యం జరుగుతోందీ ఒకే ఒక్క క్లిక్‌తో తెలిసిపోతుంది. పారదర్శకత, జావాబుదారీతనం, సిబ్బంది పనితీరు మరింతగా మెరుగుపడతాయి.

ఆఫీస్ కార్యకలాపాల నిర్వహణలో ఆధునికమైన ఒక సెన్సేషనల్ మార్పు దిశగా తొలి అడుగు వేస్తున్నTSMDC ఛైర్మన్ శేరి సుభాష్ రెడ్డి గారికీ, వారి సిబ్బందికీ ఈ సందర్భంగా హార్దిక శుభాకాంక్షలు.

వెల్‌కమ్ డిజిటల్ తెలంగాణ! 

No comments:

Post a Comment

Thanks for your time!
- Manohar Chimmani